సికింద్రాబాద్ - బేగంపేట్ పంజాగుట్ట వెళ్లే ప్రధాన రహదారిలో గురువారం ట్రాఫిక్ స్తంభించింది. భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పలు కాలనీల నుంచి ప్రధాన రహదారిపై నీరు చేరడంతో వాహనాలు ముందుకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. మెట్రో స్టేషన్ ఫ్లైఓవర్ కింద వాహనదారులు నిలపడంతో ట్రాఫిక్ స్తంభించిందని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.