కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో పార్లమెంట్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రసూల్ పురా, డబుల్ బెడ్ రూమ్, సిల్వర్ కాంపౌండ్, ఇలాయి మస్జీద్, 105 గల్లీలో ఇంటింటి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరించారు.