గాంధీ ఆసుపత్రి ఆవరణలో మరో గుర్తు తెలియని డెడ్ బాడీ వెలుగు చూసింది. చిలకలగూడ ఎస్సై జ్ఞానేశ్వర్ కథనం ప్రకారం.. గాంధీ ఎమర్జెన్సీ వార్డు సమీపంలో గుర్తు తెలియని డెడ్ బాడీ (45) ను గమనించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎలాంటి వివరాలు లభించకపోవడంతో డెడ్ బాడీని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. డెడ్ బాడీని గుర్తు పట్టిన వారు తమకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు.