కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఓ మీడియా కాంక్లేవ్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల్లో తదుపరి అధ్యక్షుడు ఎవరో చెప్పొచ్చు కానీ.. BJPలో అలా కాదన్నారు. నడ్డా తర్వాత అధ్యక్షుడు ఎవరో దేవుడు కూడా చెప్పలేడన్నారు. కేంద్రం నిధులు ఇవ్వడంలేదన్న వాదనలపై స్పందిస్తూ.. రాష్ట్రాలు గ్యారంటీలు ఇచ్చి, నిధులు కేంద్రం ఇవ్వాలంటే ఎలా? అని ప్రశ్నించారు. తాము ఇచ్చిన హమీల అమలు బాధ్యత తమదేనన్నారు. డీలిమిటేషన్ విషయంలో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదన్నారు.