ప్రయోగాలతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు మమ్ముట్టి. ఇటీవల ‘కాథల్: ది కోర్’లో ‘గే’ పాత్రలో నటించి విమర్శకులను సైతం మెప్పించారు. ఇప్పుడు మరో విభిన్న కథతో రాబోతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో రాహుల్ సదాశివన్ తెరకెక్కిస్తున్న బహుభాషా చిత్రం ‘భ్రమయుగం’. ఈ మూవీని థియేటర్స్లో బ్లాక్ అండ్ వైట్ థీమ్లోనే విడుదల చేయబోతున్నారు. ఫిబ్రవరి 15న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది.