మైదానంలో ఎంత దూకుడుగా ఆడతాడో, తన ఫన్నీ చర్యలతో అంతే ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తాడు విరాట్ కోహ్లీ. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి సెమీ ఫైనల్లో మరోసారి డ్యాన్సర్ అవతారం ఎత్తాడు. మైదానంలో తనకిష్టమైన భాంగ్రా డ్యాన్స్ చేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. కోహ్లీ డ్యాన్స్ చూసి కామెంటరీ బాక్స్లో ఉన్న హర్భజన్ సింగ్, సురేశ్ రైనా ఫన్నీ కామెంటరీతో నవ్వించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.