దేశం లో రోజురోజుకు కుటుంబ బంధాల విలువలు తగ్గిపోతున్నాయి. కేవలం 10 రూపాయల కోసం తండ్రి తల నరికి హతమార్చాడు ఓ కొడుకు. ఒడిశాలోని మయూర్భంజ్లో ఈ దారుణం జరిగింది. గుట్కా కొనేందుకు రూ.10 ఇవ్వకపోవడంతో కుమారుడు తండ్రి (70) తల నరికి హతమార్చాడు. అనంతరం నిందితుడు ఆ తలను పట్టుకుని ఠాణాకు వెళ్లి లొంగిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.