రక్త క్యాన్సర్‌లకు దేశీయ జన్యు చికిత్స.. 73 శాతం సానుకూల ఫలితాలు

60చూసినవారు
రక్త క్యాన్సర్‌లకు దేశీయ జన్యు చికిత్స.. 73 శాతం సానుకూల ఫలితాలు
లుకేమియా, లింఫోమా రక్త క్యాన్సర్‌ల కోసం దేశీయంగా అభివృద్ధి చేసిన జన్యు చికిత్స క్లినికల్‌ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు లభించాయి. ఈ ట్రయల్స్‌లో భాగంగా భారత్‌కు చెందిన రోగులకు జన్యు చికిత్స చేశారు. కాగా రోగుల్లో ఈ చికిత్స వల్ల 73 శాతం సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల వివరాలు ది లాన్సెట్ హెమటాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. దీంతో ఇకపై ఈ రక్త క్యాన్సర్‌లకు మన దేశంలోనే చికిత్స లభించే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్