AP: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసు విచారణకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి.నరసింహకిషోర్ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక పోలీస్ బృందాలు పారదర్శకంగా, ఎటువంటి డివియేషన్స్ లేకుండా కేసును సరైన పద్ధతిలో విచారణ చేస్తున్నాయన్నారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విధంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు ఉన్నాయని, వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు.