AP: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ కు రాత్రిపూట ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉందని.. ఆయన రాత్రి అయితే ఒక ఆత్మతో మాట్లాడతారన్నారు. ఉదయం లేచాక అదే మీడియా ముందు చెప్తారని జగన్ పై మంత్రి లోకేశ్ సెటైర్లు వేశారు. జగన్ అధికారంలో ఉన్నా, కోల్పోయినా ప్రజలకు దూరంగానే ఉన్నారన్నారు. బెంగళూరులో ఉంటూ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం వింతగా ఉందని లోకేష్ పేర్కొన్నారు.