వేములవాడ
ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరు పాటించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్
ఈ నెల 13వ తేదీన జరుగు ఎంపీ ఎన్నికల సందర్భంగా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరు ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్రవారం వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టెంల గ్రామంలోని ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు.