గూడ్స్ రైలులో సాంకేతిక లోపం

971చూసినవారు
గూడ్స్ రైలులో సాంకేతిక లోపం
బాసర - నిజామాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలులో సాంకేతిక లోపంతో శనివారం గంటపాటు మూసిన రైల్వే గేట్ ఎత్తకపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రైల్వే అధికారుల వివరాల ప్రకారం గూడ్స్ రైలు ఫకీరాబాద్ దాటిన తర్వాత దర్యాపూర్ గేట్ తో పాటు మండల కేంద్రంలోని ప్రధాన గేట్ మూసివేశారు. దర్యాపూర్ సమీపంలోకి వచ్చిన రైలు ఇంజన్ లో సాంకేతిక లోపం ఏర్పడడంతో అరగంటకు పైగా అక్కడే నిలిచిపోయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్