దోమకొండ మండలం సంగమేశ్వర్, ముత్యంపేటలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. సహకార సంఘం గోదామును ఖాళీ చేయించి సమీపంలోని రైస్ మిల్లుకు కేటాయించి ధాన్యాన్ని నిల్వ చేయాలని మిల్లర్లు, ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. ముత్యంపేట, చింతమాన్ పల్లిలోని సహకార సంఘం గోదాంలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని అన్లోడ్ చేయాలన్నారు.