రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

2271చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామ పరిధిలో 44వ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై సాయికుమార్ తెలిపారు. కామారెడ్డి పట్టణానికి చెందిన అర్కల వెంకట్ ఆర్టిఏ చెక్ పోస్ట్ వద్ద ఉండగా ఆయనను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టిందన్నారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. వాహనం కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత పోస్ట్