నరసింహుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

61చూసినవారు
నరసింహుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ధర్మారం మండలం ఖిలావనపర్తి గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఆలయంలో దివ్య ప్రబంధ పారాయణం, తొళక్కము తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ ఈఓ కాంతారెడ్డి, ఆలయ చైర్మన్ హన్మాన్ సింగ్ తెలిపారు. ఈ నెల 19న స్వామివారి కళ్యాణం, 24న రథోత్సవం, జాతర నిర్వహించనున్నట్లు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్