ఉపాధి కూలీల ధరలు రూ. 400 కు పెంచేలా చర్యలు
కమలాపూర్, గూడూరు, నేరేళ్ల గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ బుదవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే ఉపాధి కూలీల ధరలు రూ. 400 కు పెంచేలా చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈ పథకాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమని గుర్తుచేశారు.