గంజాయి తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్

1552చూసినవారు
జగిత్యాల జిల్లా రాయికల్ లో ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తున్న ముఠాను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు డిఎస్పీ రఘుచందర్ తెలిపారు. రాయికల్ పోలీస్ స్టేషన్లో వివరాలు తెలిపారు. జగిత్యాలకు చెందిన కొండూరి రాకేష్, ఆరుముళ్ల సాయి కుమార్ గంజాయి తరలిస్తుండగా పట్టుకుని వారి వద్ద నుండి 1. 5 కిలోల గంజాయి, ద్విచక్ర వాహనం, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్