కేసీఆర్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే గంగుల

58చూసినవారు
కేసీఆర్ కు స్వాగతం పలికిన ఎమ్మెల్యే గంగుల
పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం కెసిఆర్ ఆదివారం జగిత్యాల జిల్లాకు వెళ్లారు. బస్సు యాత్ర కరీంనగర్ నగరం నుండి వెళ్తున్న సందర్బంగా కెసిఆర్ కు మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కోతి రాంపూర్ వద్ద గులాబీ శ్రేణులు స్వాగతం పలికారు. కేసీఆర్ బస్సు యాత్రకు తమ ప్రియతమ నేతను చూసేందుకు దారిపొడువునా బారులు తీరి అభిమానాన్ని చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్