ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన

61చూసినవారు
ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన
ముత్తారం మండలం కేశనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని తెనుగుపల్లెలో బుధవారం తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందంచే ఓటర్‌ అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని పాటల రూపంలో కళాకారులు వివరించారు. ఈకార్యక్రమంలో కళాకారులు జనగామ రాజనర్సు, ఈదునూరి పద్మ, కోండ్ర వెంకన్న గౌడ్‌, దీకొండ శ్రావణ్‌, బుర్ర శంకర్‌ గౌడ్‌, సలేంద్ర రాజన్న, జిన్న రమ, కన్నూరి రేణుకలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్