చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

578చూసినవారు
చెక్ పోస్ట్ లను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్ట్ ల వద్ద అధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా షిఫ్టుల వారీగా విధులు నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ అన్నారు. మంగళవారం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే. అరుణశ్రీ అంతర్గాం మండలంలోని ఎల్లంపల్లి, పాలకుర్తి మండలంలోని వేంనూరు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసిల్దార్లు, ఎంపిడీఓ లు, సంబంధిత అధికారులు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్