పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్.. వృథాగా పోతున్న తాగునీరు

5755చూసినవారు
పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్.. వృథాగా పోతున్న తాగునీరు
పాలకుర్తి మండలం ఈశాల తక్కల్లపల్లిలోని విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో గత పదిహేను రోజుల నుండి మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి తాగునీరు వృథాగా పోతున్నది. ఈ పైప్ లైన్ ద్వారానే పాలకుర్తి, లక్ష్మీపురం, బసంతనగర్ గ్రామాలకు తాగునీరు సరఫరా అవుతుంది. పైప్ లైన్ పగలడం వలన గ్రామాలకు తాగునీరు సరఫరా సరిగ్గా అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్ కు మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్