జవాబుదారి తనంతో పని చేయాలి: మున్సిపల్ కమిషనర్

75చూసినవారు
జవాబుదారి తనంతో పని చేయాలి: మున్సిపల్ కమిషనర్
కార్యాలయ ప్రతిష్ట పెంచే విధంగా సిబ్బంది జవాబుదారీతనంతో పని చేయాలని రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ సి హెచ్ శ్రీకాంత్ సూచించారు. బుధవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో సిబ్బందితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సమయ పాలన పాటిస్తూ ప్రజాపాలన ధరఖాస్తులు, వివిధ సమస్యల పరిష్కారానికి కార్యాలయానికి విచ్చేసే వారితో మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ, వెంటనే స్పందించి సేవలందించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్