మంచినీటిని పొదుపుగా వాడుకోండి: కమిషనర్

67చూసినవారు
మంచినీటిని పొదుపుగా వాడుకోండి: కమిషనర్
గోదావరిఖని మార్కండేయ కాలనీ శివాలయం రోడ్డులో గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులు చేస్తున్న క్రమంలో నీటి సరఫరా పైప్ లైన్లకు నష్టం వాటిల్లింది. అశోక్ నగర్ ట్యాంక్ సిఎస్ పి ట్యాంక్ పరిధిలో బుధ, గురువారాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. శుక్రవారం నుండి యధాతధంగా నీటి సరఫరా చేయడం జరుగుతుందని, ప్రజలు నీటిని పొదుపుగా వాడుకొని సహకరించాలని బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ ఒక ప్రకటనలో పేర్కోన్నారు.

సంబంధిత పోస్ట్