రుద్రంగి మండల కేంద్రంలోని రాము అనే వ్యక్తికి చెందిన జ్యూవెలరీ షాప్ లో సోమవారం ప్రమాదవశాత్తు మినీ సిలిండర్ నుంచి మంటలు ఎగిసిపడడంతో అక్కడి ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి నీటితో ఇసుక సంచులతో ఎగిసి పడుతున్న మంటలను ఆర్పడంతో అక్కడున్న ప్రజలంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎస్ఐ అశోక్, పోలీసు సిబ్బంది హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు.