నాలుగు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ప్రజల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. తాగునీరుకు సాగునీరుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కాంగ్రెస్ అభ్యర్థి ఈ ప్రాంతంలో ఎవరికి తెలియదని, సీఎం పెట్టారని, బిజెపి అభ్యర్థి బండి సంజయ్ గెలుపు కోసమే డమ్మీ అభ్యర్థిని పెట్టారని కేటీఆర్ ఆరోపించారు. ముస్తాబాద్ మండలంలో బిఆర్ఎస్ మండల బూత్ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.