చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి
ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో చేపల వేటకు వెళ్లి యువకుడు మృతి చెందాడు. గ్రామస్థుల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలకిషన్ అనే వ్యక్తి గురువారం ఉదయం చేపల వేటకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతంతో మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.