ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర

71చూసినవారు
ముగిసిన కేసీఆర్ బస్సు యాత్ర
బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర శుక్రవారంతో ముగిసింది. ఏప్రిల్ 24 నుంచి 16 రోజుల పాటు 13 లోక్ సభ సెగ్మెంట్లలో కేసీఆర్ ప్రచారం చేశారు. నిన్న సిరిసిల్ల, సిద్దిపేటలో జరిగిన రోడ్ షోలలో ఆయన పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా వెంకటరావుపల్లిలో ఓ టీస్టాల్ దగ్గర ఆగి మిర్చి బజ్జీలు తిని, టీ తాగారు. తెలంగాణలో కనీసం 8 నుంచి 12 ఎంపీ సీట్లు సాధిస్తామని బీఆర్ఎస్ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్