యూపీలోని కౌశాంబిలో లాజర్ మాసిహ్ అనే ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనికి పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో పంజాబ్ పోలీసులు, యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లో గురువారం కౌశాంబిలో పట్టుబడ్డాడు. అరెస్టు సమయంలో అతడి వద్ద నుంచి అనేక అక్రమ ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.