గుజరాత్లోని అహ్మదాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నరోడా ప్రాంతంలో నివాసముండే ఇర్షాద్ మాలిక్, ఓ యువతి ప్రేమించుకుంటున్నారు. అయితే బుధవారం ఇద్దరి మధ్య గొడవ జరగడంతో ఇర్షాద్ తన ప్రేయసిని కత్తితో పొడిచి చంపేశాడు. ఆపై తాను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై నరోడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.