గొల్లగూడెం ఈద్గాలో సీపీ పరిశీలన

79చూసినవారు
గొల్లగూడెం ఈద్గాలో సీపీ పరిశీలన
ఖమ్మం 14వ డివిజన్ గొల్లగూడెం ఈద్గాలో రంజాన్ ప్రార్థనలకు జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం సీపీ సునీల్ దత్ పరిశీలించారు. వేలాది మంది ముస్లింలు ప్రార్థనకు రానున్న నేపథ్యాన పార్కింగ్, తదితర ఏర్పాట్లపై పోలీసులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ డీసీపీ ప్రసాదరావు, ఏసీపీలు రమణమూర్తి, శ్రీనివాసులు, ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్, ఎస్ఐలతో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్