తాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దు

60చూసినవారు
తాగునీటి ఇబ్బందులు రానివ్వొద్దు
తాగునీటి సరఫరాలో అవాంతరాలను సరిచేస్తూ ఎక్కడా ఇబ్బంది రాకుండా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి బుధవారం ఆమె వీసీ ద్వారా తాగునీటి సరఫరా, ధాన్యం కొనుగోళ్లు, పాఠశాలల్లో వసతుల కల్పన, వడదెబ్బ జాగ్రత్త లపై అధికారులతో సమీక్షించారు. తాగునీటి సమస్యలు తెలుసుకునేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశాల్లో అదనపు కలెక్టర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్