విద్యుదాఘాతంతో యువకుడు మృతి

65చూసినవారు
విద్యుదాఘాతంతో యువకుడు మృతి
విద్యుదాఘాతంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన పెనుబల్లి మండలంలోని లంకపల్లిలో శనివారం చోటుచేసుకుంది. గ్రామంలోని తమ ఇంట్లో విద్యుత్ మోటార్ పనిచేయకపోవడంతో కొర్రా ఏసు మరమ్మతుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురికాగా ఆయన బంధువులు సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఏసు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్