కార్మిక నాయకుడిగా కొప్పుల ఈశ్వర్ ఎన్నో ఉద్యమాలు చేశారని మాజీమంత్రి కేటీఆర్ కొనియాడారు. నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించే యువతకు కొప్పుల ఈశ్వర్ స్ఫూర్తిదాయకమన్నారు. కార్మికుడిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించి కార్మిక సంఘం నాయకుడిగా ఆయన ఎదిగారని అన్నారు. సింగరేణి కార్మికుల సమస్యల పోరాటంలో కొప్పుల చురుకైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు ఆయన ఎనలేని సేవలు చేశారని అన్నారు.