ఫోన్ పేతో బురిడీ
కరకగూడెం మండంలోని మోతే గ్రామంలో ఓ కిరణాషాపు వద్దకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఫోన్ పేతో యజమానిని బురిడీ కొట్టించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి రూ. 3,500 నగదు ఇవ్వండి ఫోన్ పే చేస్తామని నమ్మబలికి తమ మొబైల్ ఫొన్ నుంచి నగదు పంపినట్టుగా మెసేజ్ చూపించారు. దీంతో యజమాని వారికి డబ్బులు ఇచ్చాడు. ఎంతసేపటికీ అకౌంట్లో నగదు జమ కాకపోవడంతో బాధితుడు మోసపోయినట్లు గుర్తించాడు.