దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు

67చూసినవారు
దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు
చేతి కడెంతో దాడి చేసిన వ్యక్తిపై గ్రామీణ పోలీస్ స్టేషన్ లో ఆదివారం కేసు నమోదైంది. పాల్వంచ సంగం గ్రామానికి చెందిన గ్రామస్థులు శనివారం కుల దేవతకు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్థులు లైటింగ్ బాధ్యతలు వెంకన్నకు అప్పగించారు. ఇది నచ్చని శరణ్ తేజ నువ్వేంటి లైటింగ్ పెట్టేదని గొడవ పడి చేతి కడెంతో వెంకన్నపై దాడి చేశారు. బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఎస్సై సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్