ఇల్లెందు నుంచి ఆళ్లపల్లి విద్యుత్తు ఉపకేంద్రం వరకు ఉన్న 33 కేవీ లైన్ మరమ్మతు నేపథ్యంలో శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందని విద్యుత్తు సంస్థ ఏఈ రమేశ్బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆళ్లపల్లి, రాఘవాపురం, మర్కోడు తదితర గ్రామాలతోపాటు గుండాల మండల వ్యాప్తంగా విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.