భారతరత్న రాజీవ్ గాంధీ సేవలు మరువలేనివి : గింజల నరసింహారెడ్డి

567చూసినవారు
కామేపల్లి మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో దివంగత భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని రామ్ రెడ్డి వెంకట్ రెడ్డి భవన్ (పార్టీ ఆఫీస్) లో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించి రాజీవ్ గాంధీ సేవలను కొనియాడారు. పార్టీ మండల, జిల్లా, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్