వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి రాకేశ్రెడ్డి విజయం కోసం కృషి చేయాలని కేటీఆర్ కోరారు. ఓటు వేసే ముందు పార్టీతో పాటు అభ్యర్థి గుణగణాలనూ పరిశీలించి అలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ వైపు బిట్స్ పిలానీలో చదువుకున్న అభ్యర్థి.. మరోవైపు బ్లాక్ మెయిలర్, లాబీయింగ్ చేసే అభ్యర్థి ఉన్నారు. ఎవరు కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ స్థానానికి ఉపఎన్నిక జరుగనుంది.