కాంగ్రెస్ ప్రభత్వంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి: కేటీఆర్

81చూసినవారు
కాంగ్రెస్ ప్రభత్వంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయి: కేటీఆర్
కేసీఆర్ సీఎంగా ఉన్న తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఎలాంటి మతకలహాలు జరగకుండా రాష్ట్రం శాంతియుతంగా ఉందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని ఎక్స్ వేదికగా విమర్శించారు. గతంలో ఎన్నడూ మత కలహాలు లేని మెదక్ పట్టణం ఇప్పుడు అస్తవ్యస్తంగా మారడం నిజంగా సిగ్గుచేటని అన్నారు. మెదక్ లో జంతువధ విషయంలో జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలను ఆయన షేర్ చేశారు.

సంబంధిత పోస్ట్