భారతదేశంలో ప్రఖ్యాతిగాంచిన మసీదులు చాలానే ఉన్నాయి. వాటిలో జామా మసీదు ఒకటి. ఈ మసీదు యూపీలోని ఆగ్రా కోటకు ఎదురుగా, ఆగ్రా ఫోర్ట్ రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. ఈ జామా మసీదు దేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటిగా పేరుగాంచింది. దీనిని ఫ్రైడే మసీదు అని కూడా పిలుస్తారు. ఈ మసీదు ఎర్ర ఇసుకరాయి, తెల్లని పాలరాయితో నిర్మించారు. ఈ మసీదును 1648లో షాజహాన్ చక్రవర్తి నిర్మించారు.