రోడ్డు ప్రమాదంలో 8 మందికి స్వల్ప గాయాలు

73చూసినవారు
రోడ్డు ప్రమాదంలో 8 మందికి స్వల్ప గాయాలు
నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది గాయపడ్డారు. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఒకదానికి ఒకటి ఢీకొట్టుకుని బోల్తా పడి, పల్టీలు కొడుతూ కొంత దూరం వెళ్లి ఆగిపోయాయి. కార్లలో ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. ఈ సంఘటనలో 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్