నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం, పదర మండలం పరిధిలోని వంకేశ్వరం గ్రామానికి చెందిన బుచ్చి రాములు అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతన్ని కాంగ్రెస్ నేత డాక్టర్ మోపతయ్య శనివారం పరామర్శించారు. తక్షణ సహాయంగా 5వేల రూపాయలను అందజేశారు. మెరుగైన వైద్యం కోసం అచ్చంపేట ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడారు.