నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పరిధిలోని తిప్పారెడ్డిపల్లి, తిరుమలగిరి, గాజర, నిజాంబాద్ తదితర గ్రామాల్లో ఈరోజు సాయంత్రం మోస్తారు వర్షపాతం నమోదయింది. సాయంత్రం నాలుగు గంటల వరకు భారీగా ఎండ కాయగా సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మోస్తారు వర్షం కురవడంతో ప్రజలకు వేడి నుంచి ఉపశమనం లభించింది.