కండక్టర్ పై దాడి కేసులో ఇద్దరికీ 2 ఏండ్లు జైలు శిక్ష..!

577చూసినవారు
కండక్టర్ పై దాడి కేసులో ఇద్దరికీ 2 ఏండ్లు జైలు శిక్ష..!
జోగులాంబ గద్వాల జిల్లాలో ఆర్టీసీ కండక్టర్ పై దాడి చేసిన కేసులో ఇద్దరు వ్యక్తులకు రెండేళ్లు జైలు శిక్ష 500 జరిమానా విధిస్తూ అలంపూర్ జేఎఫ్ సీఎం కోర్టు ఇన్చార్జి జడ్జి ఉదయ్ నాయక్ బుధవారం తీర్పునిచ్చారు. అలంపూర్ కు చెందిన చాకలి శ్రీనివాస్, కృష్ణ అనే వ్యక్తులు 2015 మార్చి 15న కండక్టర్ కృష్ణయ్యపై దాడి చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని శిక్ష పడే విధంగా కృషి చేసినట్లు ఎస్పీ రితిరాజ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్