బీఎస్పీలో చేరిన మాజీ ఎంపీ

585చూసినవారు
బీఎస్పీలో చేరిన మాజీ ఎంపీ
నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మందా జగన్నాథం బుధవారం బీఎస్పీ పార్టీ లో చేరారు. రాజస్థాన్ లోని ఆల్వార్ పట్టణంలో బిఎస్పీ పార్టీ అధినేత మాయావతి ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు కండువా కప్పి ఆమె పార్టీలోకి ఆహ్వానించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం కొండేరు గ్రామానికి చెందిన మందా జగన్నాథం పార్టీలో చేరడంతో జిల్లాలో చర్చనీయాంశమైంది.

సంబంధిత పోస్ట్