11న లక్కీడిప్ ద్వారా ఎంపిక

57చూసినవారు
11న లక్కీడిప్ ద్వారా ఎంపిక
బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను ఈనెల 11న ఉదయం 10: 30 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఐడీఓసీ సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ లక్కీడిప్ ద్వారా ఎంపిక చేయనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ అధికారిని శ్వేతా ప్రియదర్శిని తెలిపారు. 2024-25 విద్యాసంవత్సరంకు గాను ఒకటవ తరగతిలో 57 సీట్లు, 5వ తరగతిలో 59సీట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్