పాగుంట వెంకన్న స్వామికి విశేష పూజలు

64చూసినవారు
జోగులాంబ గద్వాల జిల్లా కేటీ దొడ్డి మండలం పాగుంట గట్టుపై వెలసిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి శనివారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు స్వామికి అభిషేకం, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శనివారం దృష్ట్యా కర్ణాటక, ఏపీ రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్