లగచర్ల కేసులో రైతుకు బేడీల వ్యవహారంపై మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో ఎంపీ అరుణ మాట్లాడుతూ ఏం తప్పు చేశాడని రైతు హీర్యానాయక్ కు సంకెళ్లు వేశారు.? అమాయకులపై కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, సంకెళ్లు వేయడం ఇదేనా మీ ప్రజాపాలన అంటే అని ఫైర్ అయ్యారు. సీఎం సొంత నియోజకవర్గంలో శాంతిభద్రతలు కాపాడుకోవడం చేతగాక అమాయకులను వేధిస్తున్నారని మండిపడ్డారు.