పాలమూరు యువతికి దేశంలోనే సివిల్స్ లో మూడో ర్యాంక్

6278చూసినవారు
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ఫలితాల్లో మంగళవారం తెలంగాణకు చెందిన దోనూరు అనన్యరెడ్డి మూడో ర్యాంక్ సాధించారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం పొనకల్లుకు చెందిన అనన్య ఫస్ట్ అటెంప్ట్ నే సత్తా చాటారు. ఆంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నానని, రోజుకు 12-14 గంటలు చదివేదానినని తెలిపారు. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో చిన్నతనంలోనే సివిల్స్ చదవాలని నిర్ణయించుకున్నట్లు అనన్య తెలిపారు.

సంబంధిత పోస్ట్