చివరి శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తా: డీకే

61చూసినవారు
మహబూబ్ నగర్ బీజేపీ కార్యాలయంలో శనివారం డీకే అరుణ 65వ జన్మదిన వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. భగవంతుని దయవల్ల 64 వసంతాలు పూర్తి చేసుకుని 65 వసంతంలోకి అడుగుపెట్టడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. 40 ఏళ్లకు పైగా ప్రజలకు అందుబాటులో ఉంటూ అలుపెరుగని సేవలు అందించానని అన్నారు. చివరి శ్వాస వరకు ప్రజల మేలు కోసం పోరాటం చేస్తానని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్